మెదక్(Medak) ఐడిఓసిలో అదనపు కలెక్టర్ నగేష్ నేతృత్వంలో భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మన రాజ్యాంగం ఉన్నతమైనది.
—-అదనపు కలెక్టర్ నగేష్
…………………..
ఈరోజు 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మెదక్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం(Medak) జరిగింది. ఈ సందర్భంగా పాఠకులను, విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని ,ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ, ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో డి. ర్ .ఓ భుజంగ రావు, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: