Medak Municipal Election Results: బీఅర్ఎస్ లో గెలుపొందిన కౌన్సిల్ అభ్యర్థులు పత్రాల స్వీకరణకు మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీ అర్ ఎస్ అభ్యర్థులు 15 మంది గెలుపొందారు. ఇందులు ఐదవ వార్డు సభ్యుడు మామిడ్ల అనజనేయులు ముందుగానే గెలుపు పత్రం తీసుకోగా మిగిలిన 14 మంది సభ్యులు పోలింగ్ రోజే క్యాంప్ కు తరలి వెళ్లారు. కౌంటింగ్ రోజు(Counting day) కూడా క్యాంప్ లోనే ఉన్నారు. శనివారం ఉదయం 14 మంది సభ్యులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. గెలుపొందిన 14 మంది సభ్యులకు రిటర్నింగ్ అధికారుల చేతుల మీదుగా గెలుపు పత్రాలు అందుకున్నారు. తిరిగి మళ్ళీ సభ్యులంతా క్యాంప్ కు తరలి వెళ్లారు.
Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్కు ఎందుకింత తక్కువ?
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: