Medak: ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా కీర్తిశేషులు శ్రీ సామల యాదగిరి గారి ఆధ్వర్యంలో 55 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఉపాధ్యాయ సంఘం పి ఆర్టియు రంగా ఆవిర్భావ వేడుకలను నేడు మెదక్ జిల్లా PRTU భవన్ లో జిల్లా నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో హాజరైన సంఘ బాధ్యుల సమక్షంలో PRTU మెదక్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ మేడి సతీష్ రావు శ్రీ సామ్యా నాయక్,గౌరవ అధ్యక్షులు శ్రీ సబ్బని శ్రీనివాస్ గార్ల అధ్వర్యంలో శ్రీ సామల యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులకు వారు అందించిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
Read also: Telangana: AME డిప్లొమా కోర్సు ప్రారంభం
ఈ సందర్భంగా పిఆర్టియు మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘం కోసం నిరంతరం పాటుపడి ఉద్యోగ విరమణ పొందిన పలువురు సీనియర్ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా జిల్లా శాఖచే శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా PRTU TS సంఘం ఉపాధ్యాయుల కోసం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ గజవాడ మహేష్ గారితో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు మరియు ప్రాథమిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: