📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Maoist : కాల్పుల విరమణ పొడిగించిన మవోయిస్టు

Author Icon By Sushmitha
Updated: November 3, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టులపై(Maoist) కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో(Telangana) కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్(Jagan) పేరుతో ఒక లేఖ విడుదలైంది.

Read Also: Bihar Elections:తేజస్వీ యాదవ్ ధీమా – బీహార్‌లో ఆర్జేడీ విజయం ఖాయం

కాల్పుల విరమణ పొడిగింపు కారణాలు

గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయని మావోయిస్టు పార్టీ గుర్తు చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందని, ఈ క్రమంలో గత మే నెలలో తాము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని పేర్కొంది. గడిచిన ఆరు నెలల కాలంలో తాము అనుకున్న విధంగా శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామని, భవిష్యత్తులోనూ ఇలాంటి వాతావరణాన్నే ప్రజలు కోరుకుంటున్నారని లేఖలో రాసుకొచ్చారు.

కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని, ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో మాదిరిగానే సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు

అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో నెలకొన్న శాంతి వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దుందుడుకు చర్యలను అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, మేధావులు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

ceasefire extension Google News in Telugu Jagan. Latest News in Telugu Maoist party political statement Telangana Maoists Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.