📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

మ‌న్మోహ‌న్ సింగ్ మృతి.. సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం

Author Icon By Sudheer
Updated: December 27, 2024 • 6:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత రాజకీయ చరిత్రలో చిరస్మరణీయ నేత గా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన 91 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈరోజు (డిసెంబరు 27) సెలవు ప్రకటించింది. తెలంగాణ సీఎస్ శాంతి కుమారి గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, వారం రోజులపాటు రాష్ట్రంలో సంతాప దినాలు పాటించనున్నట్లు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ మృతిని గౌరవిస్తూ వారం రోజులపాటు సంతాప దినాలు పాటించనుంది. ఈరోజు (డిసెంబరు 27) కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ సేవలకు గౌరవం చెల్లించనున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయన అంతిమ యాత్ర ఢిల్లీలోని రాష్ట్రీయ ఘాట్ వద్ద జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించేందుకు ఢిల్లీకి చేరుకుంటున్నారు.

Manmohan Singh manmohan singh died Telangana government announced holiday

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.