📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

హైదరాబాద్లో మన్మోహన్ విగ్రహం?

Author Icon By Sudheer
Updated: December 29, 2024 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర రాజధానిలోని ముఖ్యమైన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన విశేష సేవలను గౌరవించేందుకు తీసుకున్నదిగా తెలుస్తోంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మన్మోహన్ సింగ్ పేరిట ఓ పథకాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక రంగంలో ఆయన చూపిన నాయకత్వాన్ని గుర్తుచేసేలా ఆ పథకం రూపొందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఆర్థిక సహాయం, సంక్షేమ రంగాల్లో మన్మోహన్ పేరుతో పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థంగా చేపట్టబోయే ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపును కల్పించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్ దిశగా నడిపించిన ప్రధాన కర్తవ్యం నిర్వహించారు. అతని పేరు మీద విగ్రహం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గర్వంగా భావిస్తున్నారు. ఈ విగ్రహం రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలను గుర్తు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. విగ్రహం ఏర్పాటు, పథకానికి పేరుపెట్టడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ట్రై చేస్తుంది.

hyderabad Manmohan Singh Manmohan Singh statue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.