మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఓ హృదయవిదారక సంఘటన వెలుగు చూసింది. వివాహిత లావణ్య (29) మృతి అనంతరం, ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న వరకట్నాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అంత్యక్రియలు నిర్వహించడాన్ని నిరాకరించారు. దీంతో లావణ్య మృతదేహాన్ని రెండు రోజులపాటు అంబులెన్స్ (Ambulance) లోనే ఉంచారు.లావణ్య, రామకృష్ణాపూర్కు చెందిన యువతి. ఆమె 2021లో అదే పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు సురేష్ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు దంపతుల జీవితం సవ్యంగా సాగినా, అనంతరం విభేదాలు తలెత్తాయి. తరచూ గొడవలు జరగడంతో, లావణ్య తన భర్త ఇంటిని వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
భర్త సురేష్ ఇంటి ముందుకు తీసుకువచ్చి
ఈ నెల 16న లావణ్య తన తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా, వీరికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లావణ్య తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, లావణ్య (Lavanya) ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆమె కూడా మృతిచెందింది.శుక్రవారం రాత్రి లావణ్య మృతదేహాన్ని భర్త సురేష్ (Suresh) ఇంటి ముందుకు తీసుకువచ్చి, ఆమె తల్లి, సోదరులు, కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. “మా అమ్మాయి మృతి చెందింది. ఆమెకు ఇచ్చిన రూ.50 లక్షల వరకట్నం, 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వండి. లేనిపక్షంలో మృతదేహాన్ని మీరు స్మశానానికి తీసుకెళ్లాలన్న ఆశించవద్దు” అని తేల్చిచెప్పారు.ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో, శవాన్ని రెండు రోజులపాటు అంబులెన్స్లోనే ఉంచారు. స్థానికులు, సామాజిక వేత్తలు, పోలీసుల సమక్షంలో పరస్పర చర్చలు జరిగినా, లావణ్య కుటుంబ సభ్యులు తమ డిమాండ్పై కట్టుబాటుగా ఉన్నారు.
మంచిర్యాల జిల్లా ఎక్కడ ఉంది?
మంచిర్యాల జిల్లా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది రాష్ట్ర ఉత్తర భాగంలో ఉంది.
మంచిర్యాల జిల్లా ఎప్పుడు ఏర్పడింది?
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పునర్విభజన సమయంలో, 2016 అక్టోబర్ 11న మంచిర్యాల జిల్లా ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Weather Alert: ఆంధ్ర, తెలంగాణకు వచ్చే 3 రోజులు భారీ వర్షసూచన