📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Manchireddy : మ‌ల్‌రెడ్డికి మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి స‌వాల్

Author Icon By Sudheer
Updated: April 18, 2025 • 10:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిని పక్కనపెట్టి మంత్రి పదవికే మొగ్గుచూపుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం శేరిగూడలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవాల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గత ఏడాదిన్నరుగా ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్న మల్‌రెడ్డి మంత్రి పదవి వస్తేనే అభివృద్ధి జరగాలన్న దుర్వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానన్న మాటలు గాలిలో కలిసిపోతున్నాయని, నిజంగా దమ్ముంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

మల్‌రెడ్డి చేతకాని వైఖరి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మల్‌రెడ్డి చేతకాని వైఖరితో అభివృద్ధి బకాయిల్లో పడిపోయిందని మంచిరెడ్డి అన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ దవాఖానా, పెద్ద చెరువు సుందరీకరణ వంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అంతేకాక, పూర్తయిన కూరగాయల మార్కెట్ మడిగెలను కూడా ప్రారంభించలేకపోతున్న పరిస్థితి ప్రజలకు ఏ స్థాయిలో నష్టం చేకూర్చిందో వివరించారు.

అభివృద్ధి కంటే పదవులకే ఎక్కువ ప్రాధాన్యత

ఇబ్రహీంపట్నం ప్రజలు మల్‌రెడ్డి వంటి చేతకాని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం తగదని, ఇటువంటి నాయకులు అభివృద్ధి కంటే పదవులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మంచిరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాదిన్నర కాలంగా ప్రజల్లోకి వెళ్లకుండా, సమస్యలను పట్టించుకోకుండా మంత్రి కుర్చీ కోసం ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. ఇబ్రహీంపట్నం అభివృద్ధికి తమ పార్టీ పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని, స్థానిక ప్రజలు నిజమైన అభివృద్ధి కోరుకుంటే తమ వెన్నుదన్నుగా ఉండాలని పేర్కొన్నారు.

congress Google News in Telugu machireddy malreddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.