📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mancherial: తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

Author Icon By Anusha
Updated: February 11, 2026 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు లోక్‌సభ వేదికగా స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రత్యేకంగా కొర్రమీను క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనితో పాటు రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో ఫుడ్ స్ట్రీట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. ఈ విషయాలను కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన ప్రధాన మంత్రి మత్స్య యోజన కింద తెలంగాణలో రూ.196.80 కోట్ల విలువైన ప్రతి పాదనలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

Read Also: Telangana: జూన్ నాటికి 9 వేల ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం!

Mancherial: Cormorant cluster in Telangana

తక్కువ ధరకే చేపల లభించే ఛాన్స్ ఉంది

రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యాధునిక హోల్‌సేల్ చేపల మార్కెట్, మంచిర్యాల (Mancherial) జిల్లాలో కొర్రమీను ఉత్పత్తి, ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.కాగా, హైదరాబాద్ నగరంలో అతిపెద్ద చేపల మార్కెట్, మంచిర్యాలలో కొర్రమీను క్లస్టర్ ఏర్పాటు చేయటం ద్వారా తక్కువ ధరకే చేపల లభించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలోని చెరువులతో పాటు ఏపీ సముద్రతీరం నుంచి ఎక్కువగా చేపలు వస్తుంటాయి. అయితే సుదూర ప్రాంతాల నుంచి చేపలు దిగుమతి చేసుకుంటుండటం వల్ల చేపల ధరలు ఎక్కువగా ఉంటున్నారు. అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లు అందుబాటులోకి వస్తే భోజన ప్రియులకు తక్కువ ధరకే చేపలు దొరకనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Central Government Fishery Department Korra Meenu Cluster latest news Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.