తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ పాత్రపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయిన కవిత, కాంగ్రెస్ పార్టీకి ఇందులో ఎలాంటి పాత్ర లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
“కవిత పుట్టిన సమయంలోనే తెలంగాణ కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందీ”
ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,
“అసలు కవిత (kavita) ఎప్పుడు పుట్టారు? ఆమెకు చరిత్రపై తెలియని పరిస్థితిలో ఎలా మాట్లాడగలరు?” అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో, ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రకు అన్యాయం చేయొద్దని ఆయన హెచ్చరించారు. “తెలంగాణ విలీన దినోత్సవానికి ఆమెకు ఏ సంబంధం ఉంది? చరిత్రను తెలుసుకొని మాట్లాడటం మంచిది” అని హితవు పలికారు.
తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే సస్పెన్షన్కు కారణం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)విషయంపై కూడా స్పందించిన మహేశ్ గౌడ్,
“పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించడమే ఆయన సస్పెన్షన్కు కారణమైంది” అని చెప్పారు. అయినప్పటికీ, బీసీల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా మల్లన్నకు గౌరవం ఉన్నదని పేర్కొన్నారు. “రాజకీయాల్లో ఎవరు కొత్త పార్టీలు పెట్టినా, అది ప్రజాస్వామ్య విలువలే. మల్లన్న కొత్త పార్టీ స్థాపనను స్వాగతిస్తున్నాం” అని అన్నారు.
పార్టీలో స్వేచ్ఛ ఉంది కానీ… రేడ్ లైన్ దాటితే ఊరుకోం
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది అని చెప్పిన మహేశ్ గౌడ్, కోమటిరెడ్డి సోదరులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం పట్ల అభ్యంతరం లేదన్నారు. “అయితే ఆ స్వేచ్ఛను తప్పుడు రీతిలో వాడుకుంటూ, పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు,” అని ఆయన హెచ్చరించారు. అంతర్గత వ్యవహారాల్లో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఉన్నదని, పార్టీ నియమాలు తూచ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: