బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. “తాను రాజకీయాల నుంచి తప్పుకోబోవడం లేదని, జీవితాంతం క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని” స్పష్టం చేశారు. రిటైర్మెంట్ గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదని, రాజకీయాలు తనకో జీవనవిధానంగా మారిపోయాయని పేర్కొన్నారు.
“నాకు రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు”
తన వయస్సు ప్రస్తుతం 73 ఏళ్లు అయినా, ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే కొనసాగుతానని మల్లారెడ్డి (Malla Reddy) తెలిపారు. “జపాన్ (Japan) లో ప్రజలకు రిటైర్మెంట్ అనే మాటే ఉండదట నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు” అని చెప్పడం విశేషం. కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుతూ, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
వ్యాపార అభివృద్ధి వేరు – రాజకీయ వ్యూహం వేరు
తాను తన విద్యా సంస్థల విస్తరణ (Expansion of educational institutions) పై దృష్టి పెడుతున్నానని మాత్రమే చెప్పారు తప్ప రాజకీయాలను వీడుతున్నట్టు చెప్పలేదని తెలిపారు. “నా వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను రాజకీయాలతో కలిపి చూడకండి” అని ఆయన వివరించారు. విద్యా రంగంలో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులను విస్తరించాలన్నది తన ఆలోచనని తెలిపారు. రాజకీయాలను వదిలేస్తానని అనలేదు. నా మాటలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు” అని ఆయన వివరించారు. తన వ్యాపార ప్రణాళికలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని ఆయన సూచించారు.
పార్టీ మారడం అసంభవం: బీఆర్ఎస్నే నా గమ్యం
తాను బీజేపీ లేదా టీడీపీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. “ఇలాంటి ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదు. నేను బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు. ఇదే పార్టీలో కొనసాగుతాను” అని ఆయన తేల్చిచెప్పారు. ఈ ప్రకటనతో ఆయన్ను చుట్టుముట్టిన రాజకీయ ఉహాగానాలకు ముగింపు పలికినట్లైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: