📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Mahesh Kumar Goud: కెటిఆర్ నిజాలు చెప్పాలి

Author Icon By Tejaswini Y
Updated: January 24, 2026 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్(KTR) చేస్తున్న విమర్శలపై పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఘాటుగా స్పందించారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆయన… వ్యక్తిగత హననం జరుగుతోందని కెటిఆర్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిధిలోనే విచారణ సాగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెటిఆర్ ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్

Mahesh Kumar Goud: KTR should tell the truth.

సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం

ఇద్దరి మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అన్నారు. కెటిఆర్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కుటుంబం అలీబాబా 420 దొంగల మాదిరిగా దోపిడీకి పాల్పడిందని మహేశ్ గౌడ్ తీవ్రవిమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ స్టువర్ట్ పురం దొంగల బ్యాచా మారిం దన్నారు. ఆరనీకుమా ఈకార్తీకదీపం అనే ముందు, మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దీపం ఆరిపో కుండా చూసుకోవాలని సెటైర్లువేశారు. ఫోన్ ట్యాపింగ్పై కెటిఆర్ మాట్లాడటం పూర్తిగా హాస్యా స్పదమన్నారు.

ద్యమ కేసులతో పోల్చడం సరికాదని స్పష్టం

తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలాతీవ్రమైనదని, దీనిని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. అధికారులకు కూడా పరిమితులు ఉంటాయని
అన్నారు. కాళేశ్వరం అవినీతి పై కెసిఆర్ కుటుం బంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ను తాను నేరుగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అలాగే బిజెపి నేతలపై ఉన్న ఇడి కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ కీలక ప్రశ్న లేవనెత్తారు. దేశ భద్రతకు ముప్పుగా మారే శక్తులపై మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరుగు తుందని, అలాంటప్పుడు సినిమావాళ్లఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానంతో తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కెసిఆర్ కుటుంబంలో తగాదాలకు అసలు కారణం వాటాల పంపకంలో తేడాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ పాలనలో కేవలం మూడు నెలల్లోనే 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. తన మిత్రుడి ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BRS controversy KCR Family Allegations ktr mahesh goud PCC Telangana Phone Tapping Case Telangana Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.