Mahabubnagar: పల్లె ప్రకృతి వనం పై పంజా..

Read Time:  1 min
Mahabubnagar: పల్లె ప్రకృతి వనం పై పంజా..
FONT SIZE
GET APP

200కు పైగా చెట్లు తొలగించారు

Mahabubnagar: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం జీనుగురాలలో ఘటన ఆ గ్రామంలో పల్లె ప్రకృతి వనం పేరుతో వందలాదిగా మొక్కలు నాటి పెంచి ఒక మినీ వనాన్ని తయారుచేసింది గత ప్రభుత్వం. అంతేకాకుండా ఎక్కడా లేనివిధంగా పాఠశాల పిల్లలకు చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను సైతం సమకూర్చింది. పారిశుద్ధ్యం మొక్కల పెంపకంలో ఆదర్శంగా నిలిచి గత సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి హయాంలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు సైతం పొందింది మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం లోని జీనుగురాల గ్రామం.

Read Also: TGSRTC: భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

Mahabubnagar: Claw on the village nature reserve..
Mahabubnagar: Claw on the village nature reserve..

ఇంతవరకు బాగానే ఉన్నా శనివారం గ్రామంలో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటు ఫారెస్ట్ అధికారులకు అటు రెవెన్యూ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా పల్లె ప్రకృతి వనంలోని సుమారు 200 పైగా చెట్లను తొలగించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. చెట్లను ఎవరు తొలగించారు ఎందుకు తొలగించారు అనే అంశంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చెట్లను తొలగిస్తున్న పలు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.