📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Maganti Gopinath: నేడు మధ్యాహ్నం మాగంటి అంత్యక్రియలు..ప్రముఖుల సంతాపం

Author Icon By Sharanya
Updated: June 8, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన ఇది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న బీఆర్‌ఎస్‌ నేత మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యానికి గురై 2025 జూన్ 8వ తేదీ, ఆదివారం ఉదయం 5:45కు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత గురువారం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్‌కు మొదటిసారి CPR చేసి గుండె స్పందన తిరిగి తీసుకొచ్చినప్పటికీ, అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్నారు. మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుఝామున మరణించారు.

మధ్యాహ్నం అంత్యక్రియలు – మహాప్రస్థానంలో

మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. మాగంటి గోపీనాథ్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబానికి, సమాజానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

రాజకీయ ప్రస్థానం

మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యువత నేతగా, హైదరాబాద్ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

అందులో ప్రతి విజయం ఆయన ప్రజల పట్ల నిబద్ధతకు నిదర్శనమని అనేక నేతలు కొనియాడారు.

ప్రముఖుల సంతాపం – రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి

మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశం పంపించారు. జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం.3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిసున్నా. మాగంటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Read also: Chandrababu: మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు

#BRSLeader #JubileeHillsMLA #MagantiGopinath #RIPMagantiGopinath #telangana Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.