తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) పై ప్రజలకు మరింత వెసులుబాటుగా మరోసారి గడువు పొడిగించింది. 25% రాయితీతో LRS ఫీజును చెల్లించేందుకు ఇచ్చిన గడువును ఈసారి మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోని వారికి మరో అవకాశం లభించనుంది.
ఫిబ్రవరిలో ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS)
ఇప్పటికే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) స్కీమ్ను ప్రకటించి, మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే అప్పుడు అనేక మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించకపోవడంతో ప్రభుత్వం గడువును ఏప్రిల్ 30కి, అనంతరం మే 3కి పొడిగించింది. అయినా ఇంకా చాలామంది ఆ అవకాశం వినియోగించుకోలేదని అధికారులు గుర్తించడంతో మళ్లీ మే 31వ తేదీ వరకు గడువు పెంచింది.
గడువు పొడిగింపు
ఈ రాయితీ గడువు పొడిగింపుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులకు ఉపయోగం కలగనుంది. నిబంధనల మేరకు తగిన ఫీజును చెల్లించి తమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ప్రభుత్వ రెవెన్యూకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఊరట కలిగించేలా ఈ చర్యను అధికారులు చేపట్టారు. ఇకపై గడువు మళ్లీ పొడిగించే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : Jagan : నేడు మురళీనాయక్ కుటుంబానికి జగన్ పరామర్శ