📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

మందుబాబులకు షాకింగ్ న్యూస్..తెలంగాణలో పెరుగనున్న మద్యం ధరలు..!

Author Icon By sumalatha chinthakayala
Updated: November 1, 2024 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఆబ్కారీ శాఖ శ్రమిస్తోంది. ఏపీలో మద్యం ధరలను సమానంగా చేయాలని ప్రభుత్వ యోచనలో ఉందని సమాచారం. త్వరలో బీరుకు రూ. 20, లిక్కర్‌కు రూ. 20 నుంచి 70 వరకు పెంచే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ధరలు పెరగడం ద్వారా ప్రతినెలా రూ. 1,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ ఆదాయం రావడం తగ్గుతున్నది. గుడుంబా మరియు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని ఆ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో నమోదైన కేసులు ఈ విషయం స్పష్టంగా చెబుతున్నాయి. గతేడాది మొదటి 6 నెలల్లో 9,108 గుడుంబా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది అదే సమయంలో 18,826 కేసులు నమోదు అయ్యాయి. అంటే రెట్టింపు కేసులు నమోదవ్వడంతో పాటు పదివేల మందికి పైగా గుడుంబా కేసుల్లో అరెస్టు చేశారు.

అక్రమ మద్యం సరఫరా మరియు గుడుంబా తయారీలో నిష్క్రమించేందుకు అబ్కారీ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా వ్యాట్ మరియు ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ. 36,000 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ. 9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ. 8,040 కోట్లు వచ్చాయి. అందువల్ల, ఇప్పటివరకు ఈ రెండు మార్గాల ద్వారా రూ. 17,533 కోట్లు ఆదాయం వచ్చినట్లు అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇదే మొత్తాన్ని సాధించగలమని భావిస్తే, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 35,000 కోట్లను అధిగమించేందుకు అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.

Excise Department Liquor prices prices increas Telangana Telangana Govt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.