LIC Scam: భద్రాచలం పట్టణంలో సినీ ఫక్కీలో జరిగిన ఒక భారీ ఇన్సూరెన్స్ మోసం కలకలం రేపుతోంది. ఎల్ఐసీ (LIC) ఏజెంట్లుగా పనిచేస్తున్న ఓ భార్యాభర్తలు అడ్డదారిలో కోట్లు సంపాదించాలనే ఆశతో ఏకంగా బతికున్న వారినే కాగితాల్లో చంపేశారు. నకిలీ పత్రాలతో ఎల్ఐసీ నుంచి కోట్లాది రూపాయల క్లెయిమ్ సొమ్మును కాజేశారు.
Read Also: Central Government: ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ: కేంద్రం నిర్ణయం
నిరుపేదలే లక్ష్యంగా స్కెచ్
నిరుపేదలను ఆసరాగా చేసుకుని ఈ మోసానికి తెరలేపారు. ముందుగా వారి పేరుతో ఎల్ఐసీ పాలసీలు కట్టించి పాలసీదారులు బతికుండగానే, వారు చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఇలా మొత్తం 39 మందిని రికార్డుల్లో మరణించినట్లు చూపించి భారీ స్కామ్కు పాల్పడ్డారు.
గెజిటెడ్ అధికారుల సంతకాలను కూడా వీరు ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్ ఇంకుతో నకిలీ సంతకాలు పెట్టి, అధికారులను సైతం నమ్మించేలా పత్రాలను సిద్ధం చేశారు. ఈ పత్రాల ఆధారంగా ఎల్ఐసీ నుంచి ఏకంగా రూ. 1.52 కోట్ల కాజేశారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఎల్ఐసీ యంత్రాంగం కనిపెట్టలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. ఎల్ఐసీ ఉన్నతాధికారులు లోతైన విచారణ జరపడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: