📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Latest News: Telangana – రాష్ట్రంలో భారీగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 10:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఫరూఖీ

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, గతేడాది ఇదే నెల 20న నమోదయిన గరిష్ట డిమాండ్ 15570 మెగావాట్లు కాగా, ఈ నెల 8వ తేదీనే 15906 మెగావాట్లుగా నమోదయ్యింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో గతేడాది వానా కాలం పంటల సీజన్ లో సెప్టెంబర్ 20న నమోదయిన 9910 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను తాజాగా ఈ నెల 8న 10450 మెగావాట్ల గరిష్ట డిమాండ్తో, 203.38 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని ఆ సంస్థ సిఎండి ముషారఫ్ ఫరూఖీ (CMD Musharraf Farooqui) వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్ల, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో మంగళవారం సీఎండీ ఫరూఖీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రామీణ జిల్లాల విద్యుత్ అధికారులు

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న గృహ, పారిశ్రామిక విద్యుత్ (Industrial electricity) వినియోగాలకు తోడు, ఈ వానా కాలం పంటల సీజన్ లో వ్యవసాయ వినియోగం కూడా భారీగా పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ జిల్లాల విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా వుంటూ, విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటి లభ్యతతో రాష్ట్ర వ్యాప్తంగా వానా కాలం పంటల సాగు గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. గత ఏడాది ఇదే సీజన్ తో పోల్చుకుంటే విద్యుత్ వినియోగం దాదాపు 50 శాతానికి మించి నమోదవుతుందని వెల్లడించారు. ప్రధానంగా దక్షి ణ డిస్కం పరిధిలోని జిల్లాల్లో దాదాపు రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతుందని చెప్పారు.

Latest News

యూనిట్ల వినియోగంతో

మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో గతేడాది ఇదే నెల 1వ తేదీన 13.6 మిలియన్ యూనిట్లుగా వున్న వినియోగం ఈ ఏడాది అదే రోజున 33.82 మిలియన్ యూనిట్ల వినియోగంతో దాదాపు 148 పెరుగుదలను నమోదు చేసిందని పేర్కొన్నారు. ఇదే విధంగా పలు జిల్లాల్లో వినియోగం భారీగా పెరుగుతున్నదన్నారు.

దక్షిణ డిస్కం పరిధిలో, ఈ ఏడాది అదనంగా దాదాపు 26 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం గ్రామీణ జిల్లాల్లో 4.92 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు వున్నాయని, ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లో సమస్యలు ఏర్పడితే, వెంటనే మార్చేందుకు గాను తప్పనిసరిగా ప్రతి సర్కిల్ పరిధిలో తగినన్ని రోలింగ్ స్టాక్ లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/super-six-super-hit-arrangements-complete-for-ndas-first-public-meeting/andhra-pradesh/544287/

Breaking News electricity usage hyderabad latest news Musharraf Farooqui power consumption power demand rise SPDCL Telangana electricity demand Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.