తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనేక ప్రాధాన్యమైన అంశాలపై చర్చించబడింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, పలువురు కేబినెట్ మంత్రులు హాజరయ్యారు.కేబినెట్ (TG Cabinet) సమావేశంలో మొదటగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చ జరిగింది. ఇప్పటికే ఎన్నికల గడువు ముగియబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారిక లేఖ పంపించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో పంచాయతీలు, మండల పరిషత్లు, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ త్వరలోనే మొదలుకానున్నది.
పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పులు
ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన మరో అంశం రిజర్వేషన్ల పరిమితి. 2018లో అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)లో మార్పులు చేర్పులు చేయాలని కేబినెట్ తేల్చింది. ఇప్పటి వరకు 50 శాతం సీలింగ్ వరకు మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే ప్రస్తుత భౌగోళిక పరిస్థితులు, సామాజిక ఆర్థిక వెనుకబాటు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఈ పరిమితి సరిపోదని కేబినెట్ అభిప్రాయపడింది.అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని అధిగమించే అవకాశం కల్పించేలా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా బీసీ వర్గాలకు విస్తృతంగా ప్రయోజనం కలగనుంది.

రిజర్వేషన్ల పరిమితిపై సడలింపు
కేబినెట్ చర్చల అనంతరం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని కూడా తేల్చారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది.రిజర్వేషన్ పరిమితి ఎత్తివేత ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా లబ్ధి పొందనున్నాయి. పంచాయతీ ఎన్నిక (Panchayat Election) లలో వీరి ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు ఎక్కువ స్థానాలు లభించడం ద్వారా సామాజిక సమానత్వం బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలో రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో సామాజిక న్యాయం మరింత విస్తరించనుంది.ఈ నేపథ్యంలో బీసీ వర్గాలకు అధిక ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక జీవో తీసుకురావాలని కూడా కేబినెట్ ఆమోదించింది.
గవర్నర్కు సిఫార్సు
కొత్త జీవో ప్రకారం విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థలలోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించబడతాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. సామాజిక న్యాయం బలోపేతం కావడమే కాకుండా వెనుకబడిన వర్గాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల విషయంలోనూ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన నియామకాల స్థానంలో కొత్త పేర్లను ఖరారు చేసింది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం పేర్లను గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ పరిణామం అనూహ్యంగా ఉండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ పెరిగింది. మొత్తం మీద.. తెలంగాణ కేబినెట్ ఈ భేటీ ద్వారా ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ పెంపు, చట్ట సవరణలు, ఎమ్మెల్సీ నియామకాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఖరారు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా పరిగణించవచ్చు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: