“నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడుతా’ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ (BRS party) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ మేరకు తన నిర్ణయాన్ని వెలువరించారు. తన రాజీనామా లేఖలను మీడియా ముఖంగా చూపించారు.
మళ్లీ హరీశ్ రావుపై నిప్పులు చెరిగిన కవిత
ఈ సందర్భంగా కవిత మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పై ఆమె నిప్పులు చెరిగారు. హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లొంగిపోయారని ఆరోపించారు. రేవంత్,హరీశ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారని.. ఆ ప్రయాణంలో రేవంత్ కాళ్లను హరీశ్ పట్టుకున్నారని చెప్పారు. ఆ ప్రయాణం తర్వాత హరీశ్ పూర్తిగా మారిపోయారని రేవంతు లొంగిపోయారని, ఆ తర్వాతే కుట్రలకు తెరలేసిందని కవిత ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్లను దెబ్బతీసి పార్టీని చేజిక్కించుకునే కుట్ర
రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు అన్నారు కవిత. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది. నాన్న పేరు నిలబడుతుంది అంటూ బాంబు పేల్చారు కవిత. ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్ లకు హాని చేయనని అన్నారు.
అన్నయ్య అంటూనే సూటి ప్రశ్నలు
అన్నయ్య నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పాను. చెప్పి చాలా రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా? బంధుత్వం పక్కన పెట్టండి.. మహిళా ఎమ్మెల్సీ బాధపడితే అడగరా అన్నా? అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు కవిత. కూరలో ఉప్పు, చెప్పులో రాయి వంటి వాడు సంతోష్ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు కవిత. రేవంత్ రెడ్డి ఏనాడు హరీశ్ రావును విమర్శంచడని, కేవలం కేసీఆర్, కేటీఆర్ లనే విమర్శిస్తారని అన్నారు కవిత.
Read hindi news: hindi.vaartha.com
Read also: