Latest News: Kaloji Narayana Rao – అన్ని లైబ్రరీల్లో కాళోజీ చరిత్ర గ్రంథాలు

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

పలు ఉద్యమాలను ముందుండి నడిపించిన ప్రజాకవి: మంత్రి జూపల్లి

హైదరాబాద్ (రవీంద్రభారతి) : కాళోజీ తన జీవితకాలంలో జరిగిన ప్రతీ ఉద్యమాన్నీ ఊపిరిగా మార్పుకున్నారని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ప్రాణం ఉన్నంతకాలం తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప ప్రజాకవి, ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన జీవిత చరిత్ర గ్రంథాలనను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు (Excise Minister Jupally Krishna Rao) అన్నారు. కాళోజీ తెలంగాణలో జరిగిన గ్రంథోద్యమం, భాషోద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు.

గొప్పస్ఫూర్తినిచ్చిన ఆయనను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని

బడి పలుకుల భాషకాదు మనకు పలుకుబడుల భాష కావాలని నిలదించారని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర, రచనల గురించి వివరిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు గొప్పస్ఫూర్తినిచ్చిన ఆయనను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ జరిగాయి.తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు (Telangana Language Day celebrations) వైభవంగా విశ్వవిఖ్యాతి గాంచిన జాతీయ కళావేదిక రవీంద్రభారతి ప్రధాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమాలకు,

ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, విశిష్ట అతిథులు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. నామోజు బాలాచారి, కాళోజీ ఫౌండేషన్ పొట్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కాళోజీ సాహితీ పురస్కారంతో నెల్లుట్ల రమాదేవిని సత్కరిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, రియాజ్, బాలాచారి, శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కాళోజీ పురస్కార స్వీకర్త ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి తదితరులతో కలిసి జ్యోతిప్రకా సనంచేసి కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులర్పించి ప్రసంగించారు.

Latest News
Latest News

నా గొడవ పేరుతో రాసిన కవితలు

ముందుగా ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని ఘనంగా సత్కరించి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానంచేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జూపల్లి మాట్లాడుతూ సమాజ గొడవను తన గొడవగా మార్చుకుని నా గొడవ పేరుతో రాసిన కవితలు సమాజానికి మార్గదర్శ కాలుగా మారాయని తెలిపారు. సాహిత్యం కేవలం పుస్తకాల కోసం కాదు సమాజ మార్పు కోసమనే సత్యాన్ని గుర్తుచేస్తుందని, తెలంగాణ సాహిత్య వారసత్వం కవిత్వం, గేయాలు, వచ నానికి పుట్టిల్లు సంప్రదాయ కళలు, జానపదగీతాలు సాహిత్య సంపదతో మన రాష్ట్ర ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.

రచనలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్లు సమాజంలో పరివర్తన తెచ్చేట వంటివన్నారు. అందుకే కవులు, రచయితలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోం దని చెప్పారు. అయితే వీటిని సోషల్ మీడియా ద్వారా సమాజంలోని ప్రతీ ఇంటికి, వ్యక్తికి చేరేవేసేలా, సమాజంలో నెలకొన్న దుస్థితి, దుష్పరిణామాల్లో సక్రమ మార్పువచ్చేలా సాహితీవేత్తలు కృషిచేయాలన్నారు. రాష్ట్ర సాంస్కృతి కశాఖ ఎల్లవేళలా పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని భరోసాని చ్చారు. చివరిగా కాళోజీ పురస్కార స్వీకర్త నెల్లుట్ల రమాదేవి కాళోజీ వంటి మహానుభావుడి పేరుమీద ప్రభుత్వ పురస్కారం పొందడం చాలా ఆనందంగా ఉందంటూ తన స్పందనను కొనసాగించారు.

కాళోజీ నారాయణరావు ఎవరు?

కాళోజీ నారాయణరావు తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు. ఆయనను “ప్రజాకవి కాళోజీ” అని గౌరవంగా పిలుస్తారు.

కాళోజీ నారాయణరావు ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న, కరీంనగర్ జిల్లాలోని మధీరపల్లిలో జన్మించారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-urea-permanent-measures-to-reduce-urea-usage/telangana/544324/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.