Latest News: Deputy CM Bhatti – వార్షిక రుణ ప్రణాళిక అమలు భేష్

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

తొలి క్వార్టర్లో 33.64 శాతం నమోదు

బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి

హైదరాబాద్ : బ్యాంకర్ల కమిటీ నిర్ధారించిన వార్షిక రుణ ప్రణాళిక అమలు భేష్ గా ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలోతొలి క్వార్టర్లోనే 33.64 శాతం అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం హైదరాబాద్లో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తోందన్నారు. రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ.30 వేల కోట్లు బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. అలాగే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా కూడా నిలిచిందని వెల్లడించారు.

రైతులను ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేశారు

ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగా లకు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. సకాలంలో రుణాలు (Loans) ఇవ్వడంతో పాటు, ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు అంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేశారు. బ్యాంకర్లు మానవియ కోణంలో ఆలోచించాలన్నారు. తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి. పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాల్లో బలమైన వృద్ధితో పాటు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాందని వివరించారు. అర్హులైన రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, రైతు భరోసా, కొన్ని పంటలకు బోనస్, ప్రధానమధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటి ఫలితంగా వ్యవసాయం.

Latest News
Latest News

కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు పునరుద్ధరించి

అనుబంధ రంగాల వాటా పెరుగుతోంది అన్నారు. రైతుల కోసం ఇచ్చిన హామీని నిలబెట్టి అర్హులైన వారికి రుణ మాఫీని తక్కువ సమయంలోనే అమలు చేసి చరిత్ర సృష్టించామన్నారు. వీటిలో గణనీయ సంఖ్యలో కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు పునరుద్ధరించి, రైతులకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలను సాధికారత కల్పించేందుకు, ఆదాయ సృష్టి చేసే కార్యకలాపాలకు బ్యాంకులు మరింత రుణ సహాయం చేయాలని కోరారు. వ్యాపారానికి అనుకూలమైన, సృజనాత్మక విధానాలు మరియు ప్రభుత్వ చొరవల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి, పరిశ్రమల వృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-ameerpet-no-land-will-be-given-for-the-regional-ring-road/telangana/543853/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.