భారత క్రికెట్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సిరాజ్ క్రీడల్లో చేసిన విజయాలను గుర్తిస్తూ, అతన్ని డీఎస్పీ పదవికి ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేసిన విషయాన్ని వెల్లడించారు.
క్రికెట్ రంగంలో సిరాజ్ (Mohammed Siraj) సాధించిన విజయాలను స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, “సిరాజ్ మంచి ప్రదర్శన చూపించి, భారత జాతీయ జట్టుకు కీలకమైన గెలుపులు అందిస్తున్నాడు. అతను ఇంటర్ ఫెయిల్ అయినా, కొన్ని నియమాలకు విరుద్ధమైనప్పటికీ, వాటిని మార్చి, అతనికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తూ, డీఎస్పీగా ప్రమోట్ చేయడంలో నేను ముందడుగు వేసినది గర్వకారణం.”
భారత్కు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు
శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి టీచర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్కు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం సిగ్గు చేటన్నారు.’140 కోట్ల జనాభా ఉన్న భారత్కు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ (Gold Medal) రాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా, అత్యధిక యువకులు ఉన్న భారత్కు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం మనందరికి అవమానం. ఇటీవల సౌత్ కొరియా పర్యటన వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీలో పర్యటించాను. ఒలింపిక్స్లో సౌత్ కొరియా 32 మెడల్స్ గెలిస్తే.. అందులో 16 మెడల్స్ ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులే గెలిచారు.
మూడు ఒలింపిక్ మెడల్స్ సాధించింది
మన ఉస్మానియా యూనివర్సిటీ 15- 16 వందల ఎకరాల్లో ఉంది. కానీ ఏం లాభం? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు నాకు స్వాగతం పలికిన ఒక అమ్మాయి.. ఆర్చరీ విభాగంలో మూడు ఒలింపిక్ మెడల్స్ సాధించింది. నాకు స్వాగతం పలికిన అమ్మాయిని నేను సన్మానించాల్సి వచ్చింది. చిన్న దేశం 32 పతకాలు గెలిస్తే.. ఇంత పెద్ద దేశం ఒక్క గోల్డ్ మెడల్ తీసుకురాకపోవడం అవమానం కాదా? అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. టీచర్లందరిని నేను కోరేది ఒక్కటే.. నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి. క్రీడాకారులకు గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Read also: