హెచ్ఎండిఎ కార్యాలయం ముందు బాధితుల ధర్నా
హైదరాబాద్ : అమీర్ పేట మైత్రీవనంలో ఉన్న స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రీజనల్ రింగ్ రోడ్డుకు తమ భూములు ఇవ్వబోమంటూ బాధితులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తక్కువ ధరలకు తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. చౌటుప్పల వద్ద పాట అలైన్మెంట్ అమర్చారని, దానినే కొనసాగిచాలని డిమాండ్ చేశారు.
తమ భూముల జోలికి రావద్దంటూ నినాదాలు చేస్తూ హెచ్ఎండీఏ ఆఫీస్ (HMDA Office) వద్ద జారీగా గుమిగూడి ఆందోళన చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు, ఇటీవలే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించిన ప్రైమరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన హెచ్ఎండీఏ ఆలైన్ మెంట్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 15 బోపు తెలపాలని కోరిన అధికారులు దీంతో హెచ్ఎండీఏ ఆఫీస్ వద్దకు వేదుకొని రైతులు మా భూములు ఇవ్వ బోమంటూ ఆందోళనకు దిగారు.
హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద రైతుల ధర్నా
ఇటీవల రీజినల్ పూర్వకంగా రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అలైన్ మెంట్ జిల్లాలు, 33 మండలాలు, 163 రెవెన్యూ, పంచాయతీలకు విస్తరించగా, డిజిటల్ మ్యాచ్లు, సర్వే నెంబర్లను హెచ్ ఎండీఏ అఫీషియల్ వెబ్ సైట్లో పొందుపర్చారు.
ప్రజలు, సంస్థలు 15 సెప్టెంబర్లోపు ఏమైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే హెచ్ఎండీఏ కమిషనర్కు లిఖిత ఇవ్వాలని కోరారు. దీని తర్వాత హెచ్ఎండీఏ చివరి నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. రైతులు ప్రాణం పోయినా రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) కు భూములు ఇవ్వబోమంటూ, ప్లా కార్డులో మైత్రీవనంలోని హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద రైతుల ధర్నా నిర్వహించారు.
సర్వే జరిపిన విధంగానే భూములను రింగ్ రోడ్డుకు కేటాయించాలని
రీజినల్ రింగ్ రోడ్డుకు పచ్చని పంటపోలాలను లాక్కుంటున్నారని. పంట పోలాల నుంచి కాకుండా. ఇంతకు ముందు సర్వే జరిపిన విధంగానే భూములను రింగ్ రోడ్డుకు కేటాయించాలని, దక్షిణ తెలంగాణలోని 7-జిల్లాలోని గ్రామాల రైతుల జారీగా ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఎస్.ఆర్.నగర్ ఇన్ స్పెక్టర్ శ్రీనాధ్ రెడ్డి జోర్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పి రోడ్డుపై నుండి పంపించే ప్రయత్నం చేశారు.
అనిల్ కుమారుకు పోక్సో చట్టం కింద మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధించిన కోర్టు సంజీవరెడ్డి నగర్, సెప్టెంబర్ 8: సనత్ నగర్ శ్రీనివాస్లు తెలిపిన వివరాల ప్రకారం సనతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండా వివేకానందనగర్ కాలనీలో నివాసం ఉండే లింగంపల్లి అనీల్ కుమార్ తండ్రి ఎల్.నర్సింహ్మ (42)కు కూరట్పల్లి కోర్టులో పోక్సో చట్టం కింద 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10వేల రూపాయలు జరిమానా విధించినట్లు సనత్ నగర్ ఇన్స్పెక్టర్ తెలిపారు…
Read hindi news:
Read Also: