हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR : పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

Sudheer
KTR : పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సు (BRSV State Level Conference)లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లిన పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఆయన భార్య ఫోన్ ఇవ్వలేదని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు చదివారా? మెదడు ఉందా? అంటూ ఘాటుగా నిలదీశారు. ‘‘అధికారం శాశ్వతం కాదు, మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మీ తీరుపై మిత్తీతో సహా జవాబు చెబుతాం’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మూసీ కుంభకోణం, గిరిజన భూముల లాగింపు పై ఘాటైన విమర్శలు

కేటీఆర్ మాట్లాడుతూ మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గబ్బేలెక్కారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన పోరాటంతోనే ఆ కుట్రలు ఆగిపోయాయని తెలిపారు. లగచర్లలో రేవంత్ అల్లుడి కంపెనీ కోసం గిరిజన భూములను లాక్కోవాలని కుట్ర పన్నడం హేయమని పేర్కొన్నారు. అలాంటి బాధితుల పక్షాన బీఆర్ఎస్ నిలిచిందని, కంచన్‌గచ్చిబౌలి భూముల విషయంలో విద్యార్థులే ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు.

పోరాటం చేసేవారికే భవిష్యత్ – బీఆర్ఎస్ వేదికగా శిక్షణ

కేటీఆర్ వెల్లడించిన ప్రకారం, బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా విద్యార్థులను శిక్షణ ఇస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి యువతిపై ఉందని, ఉద్యమాలు చేసే వారికే భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కలుగుతాయని స్పష్టం చేశారు. ‘‘మనం పోరాడితేనే న్యాయం సాధ్యమవుతుంది’’ అని ఉద్ఘాటించారు. పోలీసులకు రాజకీయం అనుకూలంగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలని సూచించారు.

Read Also : BRS Merge with BJP : సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870