KTR Revanth reddy remarks : జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే Balka Sumanను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ కాలం నుంచే జైలు జీవితం తమకు కొత్త కాదని, రాజకీయ ఒత్తిడులకు భయపడబోమని ఆయన అన్నారు.
“గుర్తుపెట్టుకో Revanth Reddy అధికారాలు శాశ్వతం కావు. పరిస్థితులు మారే రోజులు దూరంలో లేవు” అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read also: Thane Crime: రేబిస్ భయంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు
పోలీసు వ్యవస్థ తీరుపై స్పందిస్తూ, డీజీపీ చెప్పిన ‘ఖాకీ బుక్’ అమలు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేస్తామన్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కలిసి ప్రతిపక్షాలపై వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా
బీఆర్ఎస్ అధినేత K. Chandrashekar Rao మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారాలు మారుతుంటాయని, ప్రజలు తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: