తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లగచర్ల అనే గ్రామం ఒక్కసారిగా వార్తలలో నిలిచింది. కారణం – అక్కడి గిరిజన మహిళలు, ముఖ్యంగా ఓ ఆడబిడ్డ జ్యోతి,కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కు రాఖీ కట్టడం. ఇది సామాన్య సంఘటన కాదని, ఇది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి, కష్టకాలంలో అండగా నిలిచిన మానవీయతకు గుర్తుగా నిలిచింది.జ్యోతి (Jyothi) అనే గిరిజన మహిళ, గతంలో తన భర్తను ప్రభుత్వం అక్రమంగా జైలుకు పంపినప్పుడు తీవ్ర మనోవేదనకు గురయ్యింది.
నేను ఒంటరిగా ఉండిపోయాను
ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగంతో పోరాడేందుకు ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఆ సమయంలో ఆమెకు అన్నలాగా అండగా నిలిచిన వ్యక్తి కేటీఆర్ (KTR) అని ఆమె భావన. ఆమె మాటల్లో చెప్పాలంటే – “అప్పుడు నేను ఒంటరిగా ఉండిపోయాను. నన్ను నమ్ముకుని నిలబడ్డది ఒక్క కేటీఆర్ అన్న మాత్రమే. నా భర్తకు అన్యాయం జరిగిందని ఆయన గమనించి, న్యాయం జరిగేలా చూడాలని కృషి చేశారు. అదే నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.”
భవిష్యత్ గురించి
అంతేకాకుండా, ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉండటం వల్ల, ఆ ఆపదలో ఆమెకు అన్నగా అన్ని రకాల సాయం చేసిన కేటీఆర్, ఆమె శ్రేయస్సును దగ్గరుండి చూసుకున్నారు. తినిపించడం, మందుల పట్ల శ్రద్ధ వహించడం, భవిష్యత్ గురించి ఆలోచించడం – అన్నీ అన్న బాధ్యతతో చేశారు. ఆ సమయంలో పుట్టిన ఆమె బిడ్డకు కూడా “భూమి నాయక్” అనే పేరు పెట్టారు – ఇది కేటీఆర్ మేనమామ లెక్క అని ఆమె చెప్పడం విశేషం.ఆపదలో తనకు దేవుడు ఇచ్చిన అన్న అనే భావనతో, రాఖీ పండుగన కేటీఆర్కు రాఖీ కట్టింది లగచర్ల ఆడబిడ్డ జ్యోతి.ఈ సంఘటన జ్యోతి వంటి ఎంతో మంది గిరిజన మహిళల మనసుల్లో కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసింది.
రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు?
రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆగస్టు నెలలో వస్తుంది.
రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏమిటి?
ఈ పండుగ ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి. ఇది సోదరుడు తన సోదరిని అన్ని విధాలా రక్షించేందుకు ఇచ్చే హామీ. కుటుంబ విలువలకు, పరస్పర గౌరవానికి నిదర్శనం.
Read hindi news: hindi.vaartha.com
Read also: