నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసిబిడ్డపై జరిగిన అమానుష ఘటన నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఆందోళనలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. “రెండే నెలల పసిబిడ్డకు కులం తెలుసా? ఆ చిన్నారి ఏం తప్పు చేసిందని అంత దారుణంగా ప్రాణాలు తీశారు?” అంటూ ఆయన ప్రశ్నించారు. రాజకీయం కంటే మానవత్వం గొప్పదని పేర్కొంటూ, నిందితుడు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడైనా సరే చట్టం నుండి తప్పించుకోకూడదని, పోలీసులు ఎవరికీ తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్
కుమ్మెర బాధితులకు భరోసా కల్పించడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున కీలక ప్రకటన చేశారు కేటీఆర్. బాధిత కుటుంబానికి పార్టీ పక్షాన సొంతంగా ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి ఘోరమైన నేరాలపై ఉక్కుపాదం మోపాలని కోరారు. ఘటన జరిగిన తర్వాత అధికార యంత్రాంగం స్పందన మరియు బాధితులకు అందుతున్న సహాయంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటన ద్వారా కేటీఆర్ బాధితులకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com