తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్(BRS) పార్టీదే గెలుపని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడిందని, వారి మోసాన్ని ప్రజల ముందు ఉంచేందుకే తాము ‘బాకీ కార్డులు‘ తీసుకొచ్చామని తెలిపారు.
Read Also: Flood Warning:ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
కాంగ్రెస్ గ్యారెంటీలపై కేటీఆర్ విమర్శలు
ఈరోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్,(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ‘గ్యారెంటీ కార్డుల‘(‘Guarantee cards‘) పేరుతో కాంగ్రెస్ ప్రజలను గారడీ చేసిందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించిందని, కాంగ్రెస్ చెప్పిన ‘అభయహస్తం’ కాస్తా ‘భస్మాసుర హస్తం’గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకే తమ పార్టీ ‘బాకీ కార్డుల’ను తెరపైకి తెచ్చిందని వివరించారు.
సీఎంపై వ్యంగ్య విమర్శలు, ప్రజాభిప్రాయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఉన్న హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోవడం మానేసి, కొత్త నగరాన్ని నిర్మిస్తానంటూ ఆయన పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లోని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
స్థానిక ఎన్నికల్లో విజయం ఖాయం
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు ఎదురైనా బీఆర్ఎస్ విజయం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, ఘన విజయాన్ని సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ‘బాకీ కార్డులు’ ఎందుకు తీసుకొచ్చింది?
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడిందనే విషయాన్ని గుర్తు చేసేందుకు.
కేటీఆర్ ఏ పార్టీపై విమర్శలు చేశారు?
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: