📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

మహబూబాబాద్ మహాధర్నాకు బయలుదేరిన కేటీఆర్

Author Icon By sumalatha chinthakayala
Updated: November 25, 2024 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: మానుకోట గిరిజన మహాధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం గిరిజన మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాధర్నాలో పాల్గొనేందుకు రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. దీంతో కేటీఆర్‌కు చిట్యాల వద్ద ఘనస్వాగతం లభించింది. ఆయనకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, నకేరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇతర మాజీ ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

ఆయన కారు విండో వద్ద స్టాండింగ్‌‌లో ఉండి కేడర్‌కు కరచాలనం చేశారు. కొడంగల్‌లోని లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నా ద్వారా గిరిజనులకు భరోసా కల్పించి వారికి దగ్గర అయ్యేందుకు బీఆర్ఎస్ యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మహాధర్నా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీస్తారని సమాచారం.

కాగా, బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించి ఈనెల 25న మహా ధర్నా నిర్వహించేందుకు అనుమతి పొందారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానుండటంతో బీఆర్‌ఎస్‌ నాయకులు మానుకోటలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో కేటీఆర్ హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో మహబూబాబాద్‌కు బయలుదేరనున్నారు. మహా ధర్నా జరగనున్న నేపథ్యంలో ఫ్లెక్సీల రగడ జరుగుతోంది. కేటీఆర్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపిన వేశారు.

brs ktr Mahabubabad mahadharna Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.