📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Author Icon By Divya Vani M
Updated: March 23, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇదే ఇందిరమ్మ పాలన ఇప్పుడు రైతుల గుండెల్లో గునపం దించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు అక్షరాలా 420 అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. రుణమాఫీ, రైతుభరోసా అంశాలపై అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు మాత్రం రూ. 2 లక్షలు దాటితే మాఫీ వర్తించదని చెప్పడం ఓ మహా మోసం అని ఆరోపించారు. ‘అబద్ధపు హామీలు ఇచ్చినందుకు మిస్టర్ రాహుల్ గాంధీ, మాఫీ మాంగో తెలంగాణసే’ అంటూ తన ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

KTR ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

అధికారంలోకి రావడానికి అందరికీ రుణమాఫీ అనే మాట ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక మాత్రం కొందరికే వర్తిస్తుందని మాట మార్చారని మండిపడ్డారు.చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌ ను కాంగ్రెస్ తూట్లు పొడిచిందని ఆరోపించారు. ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా.పెట్టెలో ఓట్లు పడ్డాయ్, జేబులో నోట్లు పడ్డాయ్.ఢిల్లీకి మూటలు ముట్టాయ్.ఇప్పుడు వాగ్దానాలేంటో పట్టించుకోవడం లేదు’ అంటూ కాంగ్రెస్ పాలనను ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసిన పాపానికి కాంగ్రెస్ త్వరలోనే ప్రజల కోపాన్ని ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.

CongressVsBRS FarmersIssues ktr LoanWaiver RahulGandhi TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.