భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తరఫున నిర్వహిస్తున్న లింగంపేట్ ఆత్మగౌరవ గర్జన సభకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు కామారెడ్డి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. ఆయన సభకు హాజరుకావడానికి లింగంపేట (Lingampeta) మండలానికి బయల్దేరిన సందర్భంలో కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు.ఘనంగా ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో, డప్పులు, పూలవర్షం, పార్టీ జెండాలతో కార్యకర్తలు సందడి చేశారు. స్థానిక నాయకులు పెద్దఎత్తున పాల్గొని కేటీఆర్ (KTR) కు పూలమాలలతో ఘన సన్మానం చేశారు. మహిళలు సాంప్రదాయ బాటలో స్వాగతం పలికారు.
KTR విద్యార్హతలు ఏమిటి?
బిఎస్సీ (B.Sc) – ఓస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్,ఎంసీఎస్ (M.Sc in Biotechnology) – పునా విశ్వవిద్యాలయం,ఎంబీఏ (MBA in Marketing & E-Commerce) – City University of New York.
KTR ఏయే పదవులు నిర్వహించారు?
ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్, మైనింగ్ శాఖల మంత్రి.తెలంగాణ అసెంబ్లీ సభ్యుడు – సిరిసిల్ల నియోజకవర్గం నుండి,BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Srilakshmi IAS: శ్రీ లక్ష్మికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు