News Telugu: KTR: ఈశ్వర్ మరణంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ దే బాధ్యత

Read Time:  1 min
Save Secunderabad rally
Save Secunderabad rally
FONT SIZE
GET APP

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శ్రీసాయి ఈశ్వర్ ఆత్మహత్యపై తీవ్రంగా స్పందించారు. ఈశ్వర్ మృతి యాదృచ్ఛికం కాదని, దీనికి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth reddy) అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు.

Read also: Revanth Reddy: రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

KTR fires on Eshwar's death

KTR fires on Eshwar’s death

ఈశ్వర్ మనసు విరిగి ఆత్మహత్య

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేస్తామని కాంగ్రెస్ ఘనంగా హామీ ఇచ్చి, ఇప్పుడు దానిని అమలు చేయకపోవడం ప్రజలపై చేసిన స్పష్టమైన మోసమేనని కేటీఆర్ విమర్శించారు. ఆ ఆశ నమ్మి ఎదురు చూసిన ఈశ్వర్ మనసు విరిగి ఆత్మహత్య చేయక తప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 17 శాతం రిజర్వేషన్లకే పరిమితం చేయడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని కేటీఆర్ ఆరోపించారు.

ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, ప్రజల విశ్వాసాన్ని చంపిన ‘పాలనా హత్య’ అని ఆయన మండిపడ్డారు. కులగణన నుంచి జీవోల వరకూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తిగా ఖాళీ చేశాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.