📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

సిగ్గులేని రేవంత్ అంటూ కేటీఆర్ ఫైర్

Author Icon By Sudheer
Updated: February 26, 2025 • 10:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. “సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు” అన్న సామెతను ఉదహరించుతూ, “అలావుంది రేవంత్ రెడ్డి వ్యవహారం” అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదం జరిగినప్పుడు, “ఒక బాధ్యతగల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెడతావు”, కానీ “నీకు పాలన అంటే ఏమిటో కూడా తెలియదు” అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాదు.. ఆ వీడియో చూడు

కేటీఆర్ ప్రకారం, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ చాలా కాలం క్రితమే స్పష్టం చేశారని పేర్కొన్నారు. “ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాదు.. ఆ వీడియో చూడు.. కొంచెమైనా విషయ పరిజ్ఞానం వస్తుంది” అని ఎద్దేవా చేశారు. అదేవిధంగా, “పనులు ఆగిపోవడంతో బేరింగులు పనిచేయడం లేదని చెప్పడం ఏంటి?” అని ప్రశ్నించారు. “అసలు పనులు మొదలు పెట్టేముందు టెక్నికల్ అసెస్మెంట్, జీఎస్ఐ సర్వే చేసినట్లయితే ఈ ప్రమాదం జరిగేదా?” అని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ ఘటన రాజకీయ దుమారం

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి దానిపై మాట్లాడకుండా, నిరర్థకమైన లీకులు, అనవసరమైన చిట్ చాట్లు సాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “ప్రమాదానికి పాలకులు బాధ్యత వహించాలి” అనే విధంగా కాకుండా, “పట్టించుకోవాల్సిన విషయాలను పక్కన పెట్టి నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని” హితవు పలికారు. తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. మున్ముందు ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

cm revanth Google news ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.