हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

KTR news today : ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

Sai Kiran
KTR news today : ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

KTR news today : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా ప్రతి పట్టణంలో రెపరెపలాడాలని కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ సమన్వయకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికల వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి చోట గులాబీ జెండా ఎగరడం లక్ష్యంగా శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం కారణంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

Read Also: Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

KTR news today
KTR news today

పార్టీ శ్రేణుల ఐక్యతే విజయానికి కీలకమని స్పష్టం చేస్తూ, నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను గౌరవంగా ఆహ్వానించాలని సూచించారు. వారిని ప్రచారంలో భాగస్వాముల్ని చేస్తే పార్టీ బలం పెరుగుతుందని చెప్పారు. ప్రతి అభ్యర్థి త్యాగం చేసిన నేతలను కలుసుకుని కృతజ్ఞతలు తెలపాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు వెంటనే పంపాలని, చివరి దశ ప్రచారంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870