📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kothur Road Accident: వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం!

Author Icon By Tejaswini Y
Updated: March 12, 2026 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kothur Road Accident: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన యువకులకు పెద్ద షాపూర్ వయా మదనపల్లి లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మదనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టి, వారిపై నుండి దూసుకెళ్లింది. ఈ భీభత్సమైన ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సూరజ్, బిక్కి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Read Also : Uttar Pradesh: కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

Kothur Road Accident: Two youths die in a vehicle collision!

మృతుల్లో సూరజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా, బిక్కి పి&జి (P&G) లోని చిన్ను ఇంజనీరింగ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. చేతికి అందొచ్చిన కుమారులు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సిసిటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Kothur Road Accident Madanapalle Road Crash Rangareddy news Youth Died in Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.