గత సంవత్సరం దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మితిమీరిన వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, నిద్రమత్తు, నిర్లక్ష్యం, అతివేగం వంటి కారణాలతో రోడ్లు నెత్తికొడుతున్నాయి. (Kothagudem) కొత్త సంవత్స రంలో ప్రవేశించినా ఈ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ కాలేజీ బస్సు బోల్తా పడడంతో విద్యార్థులు గాయపడ్డారు.
Read also: TS UTF: కొత్త యేడాదిలోనైనా సర్వీసు నిబంధనలు రూపొందించాలి
ఇద్దరికి తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం మొండకుంట ప్రాంతంలో ఓ కాలేజీ బస్సు బోల్తా కొట్టింది. మణుగూరు నుండి బయలుదేరిన పాల్వంచ కె.ఎల్. ఆర్. కాలేజ్ బస్ బోల్తా కొట్టింది. దీంతో 60 మంది స్వలనపంగా గాయపడ్డారు. ఇద్దరికి మాత్రం తీవ్రంగా అయ్యాయి. వీరందరినీ 108లో భద్రాచలం (Bhadrachalam) ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాలి. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లుగా అయింది. బస్సు బోల్తాపడ్డా ఎవరూ మరణించకపోవడంతో పెద్ద ఊరట లభించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com