తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS)కి కొత్త ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని (Koppula Eshwar) నియమించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో సంఘం నాయకులతో భేటీ అయిన కేటీఆర్, ఈ కీలక పరిణామాన్ని వెల్లడించారు. బొగ్గు గనుల కార్మికుల సమస్యలపై TGBKS కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈశ్వర్కు బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎమ్మెల్సీ కవిత స్థానంలో మార్పు
ఇప్పటివరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల పార్టీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు, పరోక్ష విమర్శలు BRS లో ఆంతర్యాలు బయటపెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోనే పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకొని కవితను పక్కనబెట్టి, నూతన ఇన్ఛార్జ్గా కొప్పుల ఈశ్వర్ను నియమించినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజకీయంగా ఈ నిర్ణయానికి ప్రాధాన్యత
TGBKS నియామకం తాత్కాలిక విషయంగా కాకుండా, పార్టీ అంతర్గత పరిస్థితులకు నిదర్శనంగా మారింది. పార్టీ శ్రేణుల్లో ఒక వైపు కవిత వ్యాఖ్యలపై అసంతృప్తి నెలకొనగా, మరోవైపు వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కొప్పుల ఈశ్వర్ వంటి సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ పరిపక్వతను చాటేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Volvo XC60 : ఎక్స్ సీ60 కారుకు ఫేస్ లిఫ్ట్ మోడల్ను తీసుకువస్తున్న వోల్వో