హైదరాబాద్ కోకాపేటలోని విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు పలుకుతూ, ఆ భూమిని శారదా పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ భూమిని జలమండలికి కేటాయించడంతో మొదలైన వివాదం, రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ఈ భూ కేటాయింపు ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయింపు భూముల్లో ఇప్పటికే నిర్మాణ పనులు సాగుతున్న విషయాన్ని ముందే ఎందుకు తెలపలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించిందని భావించిన సీఎం, జలమండలికి ఇచ్చిన భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Firecracker Blast Updates: వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?
ఈ భూ వివాదం నేపథ్యంలో కోకాపేట ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోపోలిస్లోని విశాఖ శారదా పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయ స్థలాన్ని అధికారులు ఖాళీ చేయమని కోరడంతో భక్తులు, పీఠం నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత హరీశ్రావు అక్కడికి చేరుకుని ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. 2019లో అప్పటి ప్రభుత్వం చట్టబద్ధంగా కేటాయించిన భూమిని, ఇప్పుడు సెంటిమెంట్ల పేరుతో లాక్కోవడం దారుణమని ఆయన విమర్శించారు. శారదా పీఠానికి ప్రతి ప్రత్యామ్నాయంగా శంషాబాద్ ప్రాంతంలో భూమిని కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, పీఠం నిర్వాహకులు మాత్రం తాము పాత భూమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జలమండలి రిజర్వాయర్ కోసం ప్రత్యామ్నాయ భూములను అన్వేషించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. శారదా పీఠానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినందున, చట్టపరంగా వారి హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఏది ఏమైనప్పటికీ, ఈ వివాదం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసి, చివరకు ప్రభుత్వ జోక్యంతో సద్దుమణిగింది.
Read Also hindi news: hindi.vaartha.comhttp://hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :