📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu news: Kodanda Reddy: కేంద్రం తెస్తున్న విత్తన చట్టంపై రైతు కమిషన్ ఆక్షేపణ

Author Icon By Tejaswini Y
Updated: December 8, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : కేంద్రం తెస్తున్న విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదని తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి(Kodanda Reddy) అన్నారు. ఈ విత్తన చట్టం మల్టీనేషనల్ విత్తన కంపెనీలు కోసమే అన్నట్లుగా ఉందని విమర్శించారు. కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. రైతు కమిషన్ కార్యాలయంలో కేంద్రం తీసుకొస్తున్న విత్తన చట్టం ముసాయిదాపై సమీక్ష నిర్వహించారు.

Read Also:  Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ

Farmers’ Commission objects to the seed law being brought by the Center

విత్తన కంపెనీల లోపాలు సవరించుకోవాల్సిన అవసరం

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే విత్తనోత్పత్తి కి తెలంగాణ(Telangana) కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచదేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుందని చెప్పారు. తెలంగాణలో విత్తన కంపెనీల తీరు కూడా బాగాలేదని సీడ్స్ కంపెనీలు కూడా వారి లోపాలను సవరించుకోవాలన్నారు. రైతుకు నష్టం లేకుండా చట్టం ఉండాలని, దానికి కంపెనీలు కూడా చెబుతున్నాయన్నారు. ఆర్గనైజర్ల వ్యవస్థతో రైతులకు కంపెనీలకు కూడా నష్టమేనని నిర్ధారణకు వచ్చాయని వివరించారు. కానీ లక్షలాది మంది రైతుల వద్దకు నేరుగా కంపెనీ వెళ్లలేని పరిస్థితుల్లో ఈ ఆర్గనైజర్లు వచ్చారని తెలిపారు.

విత్తన అనుమతులు మరియు ధర నిర్ణయం

నకిలీ విత్తనం విషయంలో రైతులకు నష్ట పరిహారం అందించాలని స్పష్టం చేశారు. కేంద్రం తెస్తున్న చట్టంలో క్లారిటీ లేదని వ్యాఖ్యానించారు. రైతులు కోర్టులను ఆశ్రయించాలంటే వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియని విధంగా ఉందన్నారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇవ్వడం, ధర నిర్ధారణ అంత రాష్ట్ర పరిధిలో ఉండాలని కేంద్రాన్ని కోరారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

central government policy farmers commission farmers rights KodandaReddy multinational seed companies seed law Telangana Farmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.