📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kodanda Reddy: రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు పెరగాలి – రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

Author Icon By Sharanya
Updated: July 5, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యాన పంటల (Horticultural crops) సాగు పెరగాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) అన్నారు. ముఖ్యంగా కూరగాయల పంటల సాగు పెంచాలని చెప్పారు. రాష్ట్రానికి ప్రతీ రోజు లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతిని అవుతున్నాయని, వాటిని తగ్గించాలంటే రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు పెరగాలని స్పష్టం చేశారు.

Kodanda Reddy

రాష్ట్రంలో 60 మంది హర్టికల్చర్ అధికారులు

హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటల సాగు విస్తీర్ణం (Crop cultivation area) పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖలో ఉద్యోగుల కొరత, కూరగాయల సాగు చేసే రైతులకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీ కాకపోవడం, పనిభారం పెరిగిన విషయాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది హర్టికల్చర్ అధికారులే ఉన్నారని దీంతో రైతులకు ఉద్యానవన పంటల సాగుపై అవగాహాన కల్పించ లేకపోతున్నట్లు తెలిపారు. మార్కెట్లు అందుబాటులో లేకపోవడం, ఉద్యానవన పంటల సాగులో ఆధునిక పద్ధతులు, యంత్ర పరికరాలు వినియోగించక పోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు వివరించారు. అలాగే ఎలాంటి నష్టం లేని పంట పట్టు పురుగుల సాగని, దీన్ని ప్రోత్సహిస్తే రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసమావేశంలో కమిషన్ సభ్యులు భవానిరెడ్డి, గంగాదర్, సిహెచ్ వెంకన్న, ఉద్యనశాఖ అధికారుల సందీప్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Andela Sriramulu Yadav: బిజెపి నేత ఇంటి వద్ద రోహింగ్యాల అనుమానాస్పద సంచారం

#AgricultureDevelopment #CropDiversification #FarmersWelfare #HorticultureCrops #KodandaReddy #RuralEconomy #RythuCommission #TelanganaAgriculture Breaking News in Telugu Breaking News Telugu Current News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Sunday Magzine Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Paper Telugu Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu Weather Today Web Stories in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.