📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రేవంత్ 14 నెలల పాలన పై కిషన్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు

Author Icon By Sudheer
Updated: February 24, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి మరియు బీజేపీ నేత కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రేవంత్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రస్తావిస్తూ, వారి డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం అమానుషమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల కళాశాలలు నిధుల కొరత

ఉద్యోగుల మౌలిక హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులపై సీలింగ్ విధించడం తగదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల కళాశాలలు నిధుల కొరతతో మూతబడే పరిస్థితికి చేరుకున్నాయని విమర్శించారు. విద్యా రంగానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఉన్నత విద్య వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు.

అభివృద్ధి ప్రణాళికలు ఆగిపోయాయి

ఇదే సమయంలో, రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ మరింత దూకుడుగా విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి నిధులు సక్రమంగా వినియోగించకపోవడంతో, అభివృద్ధి ప్రణాళికలు ఆగిపోయాయని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని, ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు పార్టీ ముందుకు వస్తుందని ప్రకటించారు.

CM Revanth Reddy Google news Kishan Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.