బాధిత కుటుంబానికి బిజెపి అండ
మహాదేవప్ప కుటుంబాన్ని పరామర్శించమని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థిగా 6వ వార్డు నుండి పోటీ చేసి బెదిరింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మహదేవప్ప విషయాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు ప్రధాని ఈ విషయంపై ఆరా తీశారని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున రూ. 10 లక్షల చెక్కును మృతుడి భార్య సత్యమ్మకు కేంద్ర మంత్రి అందజేశారు.
Read Also: TG Municipal Elections : ఫిబ్రవరి 16న చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
మక్తల్ బిజెపి అభ్యర్థి కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి
ఈ సందర్భంగా కిషన్ (Kishan Reddy) మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. పార్లమెంటు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తాను తెలుగులో మాట్లాడడం జరిగిందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాదానని అన్నారు. తాను పార్లమెంటులో ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య సంఘటనను ప్రస్తావించిన తక్షణమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మక్తల్ వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించమని ఆదేశించారని తెలిపారు.
ఈ సంఘటన పై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి చట్టరీత్యా పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య, రంగపాండు రెడ్డి తదితరులు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: