Banakacharla Project : అంత కేసీఆరే చేసిండు – మహేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Read Time:  1 min
TPCC chief Mahesh Kumar Zoom meeting with party leaders
TPCC chief Mahesh Kumar Zoom meeting with party leaders
FONT SIZE
GET APP

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి, పొరుగు రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యలతోనే ఏపీకి లబ్ధి

“గోదావరిలో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయి, వాటిని ఏపీ వాడుకోవచ్చు” అని గతంలో కేసీఆరే స్వయంగా చెప్పారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. తెలంగాణను పక్కనపెట్టి, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆయన మాటలతోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లిందని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం

ప్రస్తుతం తమ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్ (Mahesh Kumar )మండిపడ్డారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆయన విధానాల వల్లే బనకచర్ల ప్రాజెక్టు ముందుకు వచ్చిందని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also : Saina Nehwal: మళ్లీ ఒక్కటవుతున్నసైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్?

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.