తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మరియు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల హక్కులను కాపాడటం తమ ప్రాథమిక బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన గాడిలో పెట్టుకోవడానికి రెండేళ్ల సుదీర్ఘ సమయం ఇచ్చామని, కానీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని జారవిడుచుకుందని ఆయన విమర్శించారు. “ఇప్పటివరకు ఒక లెక్క.. రేపటి నుంచి ఒక లెక్క” అంటూ హెచ్చరిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడానికి తాము నేరుగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా, ఎక్కడికక్కడ పాలకులను నిలదీసేలా తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.
Roshan: క్రికెటర్ కావాలనుకున్న: హీరో రోషన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టాయని, సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా సాగాయని కేసీఆర్ గుర్తు చేశారు. ముఖ్యంగా వెనుకబడిన పాలమూరు ప్రాంతంలో సాగునీటి కష్టాలను తీర్చడానికి వందల సంఖ్యలో చెక్ డ్యామ్లను నిర్మించి, భూగర్భ జల మట్టాన్ని పెంచామని ఆయన వివరించారు. తమ హయాంలో జరిగిన నిర్మాణాలను, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని పోల్చి చూపిస్తూ.. అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆరోపించారు.
రాబోయే రోజుల్లో తమ పోరాటం ఉధృతంగా ఉంటుందని, ప్రభుత్వానికి చమటలు పట్టించేలా ‘తోలు తీస్తాం’ అంటూ కేసీఆర్ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కాపాడటంలో విఫలమవుతోందని ఆయన విశ్లేషించారు. ప్రజల మధ్య నిలబడి పాలకుల అసమర్థతను ఎండగట్టడమే తమ తదుపరి అజెండా అని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ క్రియాశీలకంగా మారడం, ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.