తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ (SIT) అధికారులు ఆదివారం ఆయన నివాసంలో సుదీర్ఘంగా విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సుమారు 4 గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. ఈ విచారణలో ప్రధానంగా గతంలో పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం మరియు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను వాడారనే ఆరోపణలపై అధికారులు కేసీఆర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పారదర్శకత కోసం విచారణ మొత్తాన్ని అధికారులు ఆడియో మరియు వీడియో రికార్డింగ్ చేయడం గమనార్హం.
AP High Court : అంబటి రాంబాబు పై దాడి.. ఏపీ హైకోర్టు సీరియస్
ఈ విచారణను బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేసీఆర్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో నందినగర్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి ముఖ్య నేతలు కేసీఆర్ నివాసానికి చేరుకోగా, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. “మచ్చలేని నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం” అంటూ వారు నినదించారు.
విచారణ ముగిసిన వెంటనే కేసీఆర్ తన ముఖ్య అనుచరులు మరియు న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, తదుపరి తీసుకోబోయే చర్యలపై ఆయన కేటీఆర్, హరీశ్ రావులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విచారణ నివేదికను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. రెండోసారి నోటీసులు ఇచ్చి మరీ విచారించడంతో, ఈ కేసులో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విచారణ ఫలితాలు రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com