తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సాగుతున్న “తోలు తీస్తా” వ్యాఖ్యల యుద్ధం కొడంగల్ సభతో కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కేసీఆర్ వాడిన భాషపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేసీఆర్ రెండేళ్ల పాటు ఫామ్ హౌస్లో ఉండి బహుశా తోలు తీయడం ప్రాక్టీస్ చేసినట్టు ఉన్నారని, అందుకే ఇప్పుడు బయటకు వచ్చి అదే మాట మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, ఇలాంటి హెచ్చరికలు చేయడం ఆయన స్థాయికి తగదని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
CP Sajjanar: న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ను కించపరిచేలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు.. ఆయనకు చెప్పాను, మా కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు, బాగా తోలు తీస్తాడంటా, పనిలో పెట్టుకోమని చెప్పాను” అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా, పని అయిపోయాక వెళ్లేటప్పుడు ఆయనకు కూలీ కింద ‘బోటినో, తలకాయనో’ ఇవ్వు అని కూడా చెప్పానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రేవంత్ చేసిన ఈ ‘మటన్ కొట్టు’ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య భాషా మర్యాదలు కనుమరుగవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మాటల యుద్ధం కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, రాబోయే అసెంబ్లీ సమావేశాలపై కూడా ప్రభావం చూపేలా ఉంది. కేసీఆర్ తోలు తీస్తానంటే, రేవంత్ రెడ్డి ఆయనకు ‘నౌకరి’ ఇప్పిస్తానని అనడం ఇరు పార్టీల మధ్య ఉన్న వైరాన్ని స్పష్టం చేస్తోంది. అధికార పక్షం తమ సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటుంటే, విపక్షం ప్రభుత్వం విఫలమైందని వాదిస్తోంది. అయితే, అభివృద్ధిపై చర్చ కంటే ఇలాంటి వ్యక్తిగత విమర్శలే ప్రజల్లో ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ శ్రేణులు ఎలా ప్రతిస్పందిస్తాయో, అసెంబ్లీ వేదికగా ఈ యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com