తెలంగాణ(Telangana) రాష్ట్ర సాధన పోరాటంలో కొత్త దిశను చూపించిన కీలక రోజు ఇది. 2009 నవంబర్ 29న BRS అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) ఆమరణ దీక్షకు దిగుతూ, “తెలంగాణ వస్తేనే నేను బ్రతుకుతా” అన్న సందేశంతో ప్రజలను ఉద్యమపథంలోకి నడిపించారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకీ దిగజారుతుండడంతో తెలంగాణ ప్రదేశ్ మొత్తం ఆందోళనతో కదిలిపోయింది.
Read Also: Telangana Panchayat Elections: రెండో రోజు 4,901 సర్పంచి నామినేషన్లు దాఖలు
విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చివరకు డిసెంబర్ 9న “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం” అని ప్రకటించాల్సి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: