పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ ఉప ఎన్నికల (By-elections) కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రతి నాయకుడు కృషి చేయాలని, ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి దృష్టి పెట్టాలని కేసీఆర్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని కేసీఆర్ (KCR) విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో కనీసం డజన్ మంది ఎంపీలు ఉన్నా బనకచర్ల అంశంపై గట్టిగా పోరాడి ఉండేవారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తగిన విధంగా
బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని కేసీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడం తో పాటు బహిరంగ సభ నిర్వహించి ప్రజల మద్దతును సంపాదించుకోవాలని సూచించారు. తెలంగాణ హక్కుల విషయంలో ఎవరూ వెనకడుగు వేయకుండా, తగిన విధంగా పోరాడాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు.బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. 8న కరీంనగర్లో జరిగే భారీ సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేస్తుందని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్ పూర్తి పేరు ఏమిటి?
కేసీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
కేసీఆర్ ఏ పార్టీకి అధినేత?
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి – BRS) పార్టీ వ్యవస్థాపకుడు అధినేత.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sucide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య