KCR: సౌదీ అరేబియాలో (Saudi Arabia) జరిగిన పెద్ద బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉమ్రా యాత్ర చేస్తున్న యాత్రికులు మక్కా నుంచి మదీనా దిశగా ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మొత్తం 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన 16 మంది ఉన్నారని అధికారులు ధృవీకరించారు. తెల్లవారుజామున బదర్–మదీనా రహదారిలో బస్సు ఓ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయని తెలుస్తోంది. బస్సులో చాలామంది నిద్రలో ఉండడంతో బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా చాలా మంది దుర్మరణం పాలయ్యారు.
Read also: Hyderabad traffic: సాగర్ ఎక్స్ రోడ్డు ఫ్లైఓవర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Fatal bus accident in Saudi Arabia KCR stands by the victims
కేసీఆర్ తీవ్ర విచారం
KCR ఈ దుర్ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన సానుభూతిని తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాలని ఆయన కోరారు. ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసింది. బాధితుల వివరాల కోసం 79979 59754, 99129 19545 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: